ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపోరు: పశ్చిమగోదావరిలో వైకాపా ఘన విజయం - పశ్చిమగోదావరిలో వైకాపా ఘన విజయం తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను వైకాపా తన ఖాతాలో వేసుకుంది. ఎలాంటి పోటీలేకుండా ఏకపక్ష విజయం సాధించింది. కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లో విజయదుందుభి మోగించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్​లో ఎన్నికలు జరిగినా...ఓట్ల లెక్కింపు వాయిదా వేశారు.

పశ్చిమగోదావరిలో వైకాపా ఘన విజయం
పశ్చిమగోదావరిలో వైకాపా ఘన విజయం

By

Published : Mar 14, 2021, 7:14 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పురపోరులో వైకాపా సత్తా చాటింది. జంగారెడ్డిగూడెం, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల్లో విజయదుందుభి మోగించింది.

  • నరసాపురం పురపాలికలో 31వార్డులు ఉండగా..మూడు వార్డులు వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 28 వార్డులకు ఎన్నికలు జరగగా...22 వైకాపా, 3 తెదేపా, 1 జనసేన, 2 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
  • నిడదవోలు మున్సిపాలిటీలో 28 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా...27 వార్డుల్లోనూ వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. తెదేపా ఒక స్థానంతో సరిపెట్టుకుంది.
  • కొవ్వూరు మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా..గతంలోనే 13 ఏకగ్రీవమయ్యాయి. అందులో వైకాపా 9, తెదేపా 4 వార్డులను ఏకగ్రీవం చేసుకొన్నాయి. మిగిలిన 10 వార్డులకు ఎన్నికలు జరగగా..వైకాపా 6, తెదేపా 3, భాజపా 1 వార్డులో విజయం సాధించాయి. ఏకగ్రీవాలతో కలుపుకొంటే..వైకాపా 15, తెదేపా 7 వార్డులను కైవసం చేసుకున్నాయి.
  • జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 29 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా...25 వార్డుల్లో వైకాపా, 3 వార్డుల్లో తెదేపా, 1 వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.

హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్​లో ఎన్నికలు జరిగినా...ఓట్ల లెక్కింపు వాయిదా వేశారు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపును ఎప్పుడు నిర్వహించాలన్నది తేలనుంది.

ABOUT THE AUTHOR

...view details