పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్ని నాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ ముత్యాలరాజు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఎడితెరిపిలేని వర్షం వల్ల జరగాల్సిన ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు.
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి పేర్ని నాని - 74వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.
![స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న మంత్రి పేర్ని నాని స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి పేర్నినాని... జాతీయ జెండా ఆవిష్కరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8430334-236-8430334-1597488488725.jpg)
స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న మంత్రి పేర్నినాని... జాతీయ జెండా ఆవిష్కరణ
మంత్రి పేర్ని నాని వర్షంలోనే జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ప్రపంచానికి సవాల్ విసురుతున్న కొవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొందామని మంత్రి అన్నారు. స్వీయ భద్రత పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి :జిల్లాలో భారీ వర్షం... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి