ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏలూరు వింత వ్యాధిపై బుధవారానికి స్పష్టత: మంత్రి ఆళ్ల నాని

By

Published : Dec 12, 2020, 5:33 PM IST

ఏలూరు ఘటనపై జాతీయ సంస్థల పరిశోధన కొనసాగుతోందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఆ సంస్థలు తుది నివేదిక ఇచ్చాకే వ్యాధి కారణాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. వింత వ్యాధి బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.

MINISTER ALLA NANI
MINISTER ALLA NANI

మీడియాతో మంత్రి ఆళ్ల నాని

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధిని నిర్ధరణ చేయడానికి మరో ఐదు రోజుల సమయం పడుతుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. నగరంలో వింత వ్యాధి బారినపడిన బాధిత కుటుంబాలను మంత్రి శనివారం పరామర్శించారు. వారితో మాట్లాడి.. సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వీధుల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం పరిస్థితులు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రస్తుతం ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొందని అన్నారు.

వ్యాధి కారణాలపై జాతీయ సంస్థలు పరిశోధన సాగిస్తున్నాయి. ఆ సంస్థలు బుధవారం తుది నివేదికలు అందజేసే అవకాశం ఉంది. ఆ తరువాతే వ్యాధికి కారణాలు వెల్లడిస్తాం. ఏలూరులోని తాగునీటిలో ఎలాంటి కాలుష్యం లేదని ప్రాథమికంగా నిర్ధరణ అయింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు- ఆళ్ల నాని, వైద్యారోగ్యశాఖ మంత్రి

ABOUT THE AUTHOR

...view details