దెందులూరు మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె సాయి నవ్యశ్రీకి.. ప్రముఖ వ్యాపారవేత్త వంకినేని భానుప్రకాష్ కుమారుడు పృథ్వీతో ఈనెల 4వ తేదీ వివాహం జరిగింది. తెదేపా అధినేత చంద్రబాబు వారిని ఆశీర్వదించారు. చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు దెందులూరులో మాజీమంత్రి పితాని సత్యనారాయణ ఇంటికి వెళ్లి.. కొత్తగా పెళ్లైన ఆయన కుమారుడిని ఆశీర్వదించారు.
ఏలూరులో చంద్రబాబుకు ఘనస్వాగతం
తెదేపా అధినేత చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించారు. దెందులూరు మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె వివాహం ఇటీవల జరిగింది. నూతన దంపతులను చంద్రబాబు ఆశీర్వదించారు. ఏలూరులో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
![ఏలూరులో చంద్రబాబుకు ఘనస్వాగతం chandra babu blessings to chintamaneni daughter in eluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10331113-485-10331113-1611248970391.jpg)
ఏలూరులో చింతమనేని కుమార్తెను ఆశీర్వదించిన చంద్రబాబు