19:36 December 06
ఏలూరులో అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుల్లో ఒకరు మృతి చెందారు. విద్యానగర్కు చెందిన శ్రీధర్(45).. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్ర అస్వస్థతో ఉదయమే ఆసుపత్రిలో చేరిన శ్రీధర్కు... వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మరణించాడని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి
Last Updated : Dec 6, 2020, 7:58 PM IST