ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వాహన మిత్ర' ఆర్థిక సాయానికి ఉత్తర్వులు జారీ - వాహన మిత్ర పథకం ఆర్థిక సాయానికి జీవో విడుదల వార్తలు

2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీలు నడిపే యజమానులకు 10 వేల ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది.

ysr vahanamitra scheeme go issued
ysr vahanamitra scheeme go issued

By

Published : May 21, 2020, 1:39 PM IST

వైఎస్​ఆర్​ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సాయానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2 లక్షల 36 వేల 344 మందికి రెండో విడత ఆర్థిక సాయం చేయనున్నారు. అర్హుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఈబీసీ, క్రిస్టియన్ కార్పొరేషన్​ల ద్వారా ఈ నిధులు విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 4వ తేదీన నిధులు విడుదల కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details