ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

YS Sharmila:'సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతా' - ఉమ్మడి కరీంనగర్​లో షర్మిల పర్యటన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైఎస్‌ షర్మిల(YS Sharmila) పర్యటిస్తున్నారు. ఉదయం 7గంటలకు లోటస్‌ పాండ్‌ నుంచి పర్యటనకు బయలుదేరి వెళ్లారు. షర్మిల పర్యటనలో అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

YS Sharmila
వైఎస్‌ షర్మిల

By

Published : Jun 25, 2021, 4:08 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్సార్‌ కుమార్తె షర్మిల (YS Sharmila) తొలిసారిగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ములుగు మండలం ఒంటిమామిడి కూరగాయల మార్కెట్ ముందు ఉన్న వైఎస్ఆర్​ విగ్రహానికి ఆమె పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అదే విధంగా రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించారు. అల్మాస్‌పూర్‌లోని కరోనా మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని ఆమె అన్నారు. సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని వైఎస్‌ షర్మిల (YS Sharmila) తెలిపారు. త్వరలో తెలంగాణకు మంచి రోజులొస్తున్నాయని భరోసా ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న వైఎస్ షర్మిల.. ఆ దిశగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలో తొలిసారి సభ జరగనుండటంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

పేదలందరికీ మెరుదైన వైద్యం అందించాలని వైఎస్​ హయాంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతోందా...? కొవిడ్​ సమయంలో ఎంతో మంది కుటుంబసభ్యులను కోల్పోయారు. వైద్య ఖర్చుల కోసం ఇళ్లను కూడా అమ్మేసుకున్నారు. ఎంతో మంది మహిళలు భర్తలను కోల్పోయి పిల్లలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో బాగవుతారన్న నమ్మకం ప్రజలకు లేదు. వైద్య ఖర్చుల కోసం ఆస్తులన్నీ తెగనమ్ముకున్నా ప్రాణాలు దక్కని పరిస్థితి. పోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పిద్దామంటే బెడ్లు ఉంటే ఆక్సిజన్​ ఉండడం లేదు... ఆక్సిజన్​ ఉంటే బెడ్లు ఉండవు. ఇదీ సర్కారు దవాఖానాల పరిస్థితి.- వైఎస్​ షర్మిల

ఇదీ చూడండి:NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details