ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 24, 2021, 3:00 PM IST

ETV Bharat / city

విద్యార్థులతో షర్మిల భేటీ.. సమస్యలపై ఆరా

వైఎస్​ షర్మిల తెలంగాణ వర్సిటీ విద్యార్థులతో లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ys-sharmila-met-with-students-in-lotus-pond-banjarahills-hyderabad
విద్యార్థులతో షర్మిల భేటీ.. సమస్యలపై ఆరా..

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో వైఎస్​ షర్మిల సమావేశమయ్యారు. బంజారాహిల్స్ లోటస్​పాండ్​లోని ఆమె నివాసానికి పలు విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులతో షర్మిల భేటీ అయ్యారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం అమలు తీరు, తదితర అంశాలపై షర్మిల విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details