ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 22, 2021, 4:07 PM IST

ETV Bharat / city

YS SHARMILA: జగనన్నకు ట్విట్టర్ వేదికగా రాఖీ శుభాకాంక్షలు

రాఖీపౌర్ణమి సందర్భంగా సీఎం జగన్​ సహా.. పార్టీ కార్యకర్తలు, నేతలకు.. వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొని... కార్యకర్తలకు రాఖీలు కట్టారు.

YS SHARMILA
షర్మిల

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ లోటస్​పాండ్​లోని వైఎస్​ఆర్​టీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు.. అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి.. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎం జగన్​ సహా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఓ ట్వీట్​ చేశారు.

'నా తోడబుట్టిన జగనన్నకు, నేను నమ్మిన సిద్ధాంతం కోసం నాకు అండగా నిలిచిన, నేనెంచుకున్న మార్గంలో నాతో కలిసి నడుస్తున్న, నా ఆశయ సాధనలో నన్ను నిలబెడుతున్న ప్రతి అన్నకు, తమ్ముడికి సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్​ చేశారు.

నిరుద్యోగుల అంశంపై తమ పార్టీ మొదటి నుంచి దీక్షలు చేస్తోందని, హుజూరాబాద్​ ఉపఎన్నికల్లో వందకుపైగా నిరుద్యోగ అభ్యర్థులను బరిలో దించుతామని.. ఆ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు.

ఇదీచూడండి:

CBN: చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు

ABOUT THE AUTHOR

...view details