ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 17, 2021, 8:46 PM IST

ETV Bharat / city

తెలంగాణ: కరోనా టెస్టులు చేస్తున్న సిబ్బందిపై దాడికి యత్నం

హైదరాబాద్​ భోలక్​పూర్​లో కరోనా పరీక్షా కేంద్రాన్ని తరలించాలని స్థానిక యువకులు సిబ్బందిపై దాడికి యత్నించారు. అక్కడి ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ పరీక్షా కేంద్రం వల్ల తమ బస్తీ ప్రజలకు కరోనా వ్యాపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

corona testing at bholakhpur, bholakhpur residents attack on covid testing workers
భోలక్​పూర్​లో కరోనా టెస్టులు చేస్తున్న సిబ్బందిపై దాడికి యత్నం, భోలక్​పూర్​లో ఆరోగ్యకార్యకర్తలపై దాడి

ఆరోగ్య సిబ్బందితో స్థానికుల వాగ్వాదం

హైదరాబాద్​లో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుండగా... భోలక్​ పూర్​లోని కొందరు యువకులు కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని తరలించాలని డిమాండ్ చేయడం అందరినీ తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్​పూర్​ రంగానగర్​లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్​లో కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఏడాదిగా కొనసాగుతున్న ఈ పరీక్ష కేంద్రాన్ని తమ బస్తీ నుంచి తరలించాలని కొందరు యువకులు సిబ్బందిపై దాడికి యత్నించారు. తమ బస్తీలో ఉన్న ఈ పరీక్షా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కరోనా బాధితులు రావడం వల్ల ప్రజలకు కరోనా వ్యాధి సోకుతుందని, కొందరు యువకులు సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారు.

ఇదీ చదవండి: ఆ ఆస్పత్రిలో కొవిడ్​ రోగులకు మ్యూజిక్​ థెరపీ!

ఈ పరీక్షా కేంద్రం వల్ల తమ బస్తీ ప్రజలకు కరోనా వ్యాపిస్తుందని స్థానిక యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరులు కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రానికి రావొద్దని స్థానిక యువకులు కొందరిని భయాందోళనకు గురి చేసి వెనక్కు పంపి వేయిస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో స్థానిక యువకులు పారిపోయారు. తాము ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నామని, కానీ స్థానిక యువకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా కల్లోలం..కొత్తగా 7,224 కేసులు, 15 మరణాలు

ABOUT THE AUTHOR

...view details