young man committed suicide: ప్రైవేట్ ఫైనాన్షియర్ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఆర్జీఐఏ(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) ఠాణా పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
రంగారెడ్డి జిల్లాలోని పాత శంషాబాద్ జెండా చౌరస్తాకు చెందిన సాయి కిరణ్(25) కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకొని ద్విచక్ర వాహనాన్ని కొన్నాడు. నెలనెలా చెల్లించాల్సిన ఇన్స్టాల్ మెంట్ సక్రమంగా చెల్లించడం లేదంటూ సాయి కిరణ్ను దూషించి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.