ఎమ్మెల్యే రోజాపై అసభ్యకర పోస్టింగులు పెట్టడంపై వైకాపా మహిళా విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనపు డీజీపీకి ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల మహిళా విభాగం సమన్వయకర్త పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో లైంగిక ఆరోపణలు చేశారంటూ ఆమె పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యేపై అసభ్యకర వార్తలు... వైకాపా మహిళా విభాగం ఫిర్యాదు - ycp women complaint on social media postings upon mla roja
సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే రోజాపై అసభ్యకర రాతలు, పోస్టింగులను వైకాపా మహిళా విభాగం ఖండించింది. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేపై అసభ్యకర వార్తలు... వైకాపా మహిళా విభాగం ఫిర్యాదు