ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Jun 24, 2020, 6:04 PM IST

Updated : Jun 24, 2020, 6:24 PM IST

YCP mp raghu ram krishnam raju
YCP mp raghu ram krishnam raju

18:03 June 24

షోకాజ్‌ నోటీసుపై స్పందించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఎంపీ రఘురామకృష్ణరాజు

వైకాపా అధిష్టానం జారీ చేసినషోకాజ్‌ నోటీసుపై ఆ పార్టీ ఎంపీ  రఘురామకృష్ణరాజు స్పందించారు. 18 పేజీల నోటీసులో రెండు పేజీలు రాతపూర్వకంగా ఉంటే... మిగతా 16 పేజీలు వివిధ పత్రికా క్లిప్పింగ్​లు జతపరిచారన్నారు. తాను పార్టీపై, అధ్యక్షుడినిగానీ ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు కొన్నిచోట్ల సజావుగా అమలుకావట్లేదని సూచనలు చేశానని వ్యాఖ్యానించారు.  సీఎం అపాయింట్‌మెంట్ దొరకనందునే మీడియా ముఖంగా తెలియజేశానని వివరించారు. 

'నేను ప్రభుత్వానికి సూచనలు చేశానే తప్ప పార్టీకి కాదు. దేవాలయ భూముల విషయం, ఇతర అంశాలను సీఎంకు సూచనపూర్వకంగా తెలియజేశా. పార్టీని, అధ్యక్షుడిని పల్లెత్తు మాట అనలేదు, అదే వివరణ రేపు అందిస్తా. నాకు 7 రోజుల సమయం ఇచ్చినా గురువారమే సమాధానం పంపుతా' -  రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. వైకాపా షోకాజ్ నోటీసు

Last Updated : Jun 24, 2020, 6:24 PM IST

ABOUT THE AUTHOR

...view details