హైకోర్టులో ఎమ్మెల్యే జోగి రమేశ్ లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిగింది. పార్టీకి సంబంధించిన ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చన్న హైకోర్టు... అభ్యర్థులతో జోగి రమేశ్ మాట్లాడకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈనెల 17 వరకు మీడియాతో మాట్లాడవద్దని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో... ఆ ఆదేశాలను హైకోర్టులో జోగి రమేశ్ సవాల్ చేశారు.
జోగి రమేశ్.. పార్టీ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చు: హైకోర్టు
ఎమ్మెల్యే జోగి రమేశ్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పార్టీకి సంబంధించిన ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది.
హైకోర్టులో జోగి రమేశ్ లంచ్ మోషన్ పిటిషన్ విచారణ
Last Updated : Feb 12, 2021, 4:37 PM IST