రాజధాని అమరావతి పర్యటనలో చంద్రబాబుపై చెప్పులు, రాళ్లతో దాడి చేసి అక్కడి రైతులు తగిన బుద్ధి చెప్పారని మంత్రులు కొడాలి నాని, పేర్నినాని అన్నారు. నమ్మి 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని.. దీనికి రైతులు తిరగబడ్డారని అన్నారు. రైతుల భూములను అభివృద్ధి చేయకుండా ప్రైవేటు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి దోచుకున్నారని ఆరోపించారు. అమరావతిని గ్రాఫిక్స్లో చూపించి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆక్షేపించారు. అమరావతిని అభివృద్ధి చేస్తానంటోన్న చంద్రబాబు అక్కడ ఇళ్లు ఎందుకు కట్టుకోలేదని నిలదీశారు. 1 లక్ష 5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు ఐదేళ్లలో కేవలం 5 వేల కోట్లే ఖర్చు పెట్టారని.. దీనికి ఏటా 570 కోట్ల వడ్డీ అవుతోందన్నారు.
మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలా