ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2020, 8:53 AM IST

ETV Bharat / city

తెలంగాణ యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ, రాబడి

తెలంగాణ యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ఆదివారం(13న) భక్తుల మొక్కులు, పూజలతో సందడిగా మారింది. క్రమంగా రాబడి సైతం పెరిగింది. కార్తిక మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని కానుకలు చేల్లించుకున్నారు. ఈ సందర్భంగా గత ఆదివారంతో పోలిస్తే ఈసారి ఆదాయం పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.

Yadadri Temple
తెలంగాణ యాదాద్రి ఆలయంలో పెరిగిన రద్దీ

తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయానికి కార్తిక మాసం ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వ్రతాలు, దీపారాధనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

ఆదివారం(13న) భక్తుల నుంచి రాబడి పెరిగింది. వివిధ విభాగాల ద్వారా వ్రతాలు, శీఘ్ర దర్శనం, కళ్యాణకట్ట, ప్రసాద విక్రయాలు, తదితర పూజలతో ఆలయానికి చేకూరిన ఆదాయం రికార్డు స్థాయిలో రూ.40,84,610లకు చేరింది.

ఇదే నెల ఆరో తేదీన రూ.36.15 లక్షల ఆదాయం రాగా, ఆ రాబడిని మించి చేకూరడం విశేషమని ఆలయ ఈఓ గీతారెడ్డి, అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి :పల్నాడులో వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details