ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 23, 2020, 7:40 AM IST

ETV Bharat / city

సీఎం జగన్ పుట్టిన రోజున రక్త సేకరణలో ప్రపంచ రికార్డు

ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా 34,723 మంది 34,723 యూనిట్ల రక్తం దానం చేశారు. ఇది ప్రపంచ రికార్డు సాధించిందని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎ.శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు.

CM JAGAN
CM JAGAN

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో రక్తాన్ని సేకరించి ప్రపంచ రికార్డు సాధించినట్లు ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ రాష్ట్ర శాఖ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎ.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.

సీఎం పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో ఒక్క రోజులోనే మొత్తం 34,723 మంది నుంచి 34,723 యూనిట్ల రక్తం సేకరించటం ప్రపంచ రికార్డు అని వెల్లడించారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details