నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లు, పురపాలక, నగర పంచాయతీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల రాష్ట్రస్థాయి సదస్సు జరగనుంది. విజయవాడలోని ఎ-కన్వెన్షన్ హాలులో ఉదయం 9.30 గంటలకు పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభిస్తారు. ఈ రోజు సమావేశాలు ప్రారంభమై.. రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. గురువారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించే ముగింపు సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొల్గొంటారని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న సాయంత్రం బొత్స సత్యనారాయణ సదస్సు ఏర్పాట్లు పరిశీలించారు.
నేటి నుంచి మేయర్లు, పుర ఛైర్మన్ల కార్యశాల - minister botsa satyanarayana news
మేయర్లు, పురపాలక సంస్థల ఛైర్మన్ల రాష్ట్రస్థాయి సదస్సు ఈ రోజు విజయవాడలో జరగనుంది. పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
![నేటి నుంచి మేయర్లు, పుర ఛైర్మన్ల కార్యశాల botsa satyanarayana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11220449-310-11220449-1617162704318.jpg)
మంత్రి బొత్స సత్యనారాయణ