హైదరాబాద్ రహ్మత్నగర్లో నివసించే వెంకటయ్య ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. మూడు రోజులుగా అతని భార్య పద్మ(28) చికెన్ బిర్యానీ తీసుకురావాలని భర్తను కోరింది. తన మాటను పెడచెవిన పెడుతున్నాడని భావించిన పద్మ... బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుంది.
తెలంగాణ: బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం - WOMEN SUICIDE NEWS
ఏది కావాలన్నా భర్తను భార్య అడగటం కామన్. ఒకవేళ నచ్చింది తీసుకురాకపోతే అలగడమూ సహజమే. కానీ ఓ మహిళ భర్త బిర్యానీ తీసుకురాలేదని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

తెలంగాణ: బిర్యానీ తేలేదని భార్య ఆత్మహత్యాయత్నం
చుట్టుపక్కలవారు గమనించి ‘108’ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దాదాపు 70 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలియజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:వారితో వేడుక చేసుకున్న ట్రంప్!