ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పేదవాడి ఆకలి తీర్చేందుకు ఏం చర్యలు తీసుకున్నారు'

By

Published : Apr 29, 2020, 1:35 PM IST

సీఎం జగన్​పై ట్విటర్​ వేదికగా దేవినేని ఉమ విమర్శలు సంధించారు. రాజప్రాసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి.. పేదవాళ్ల ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలేంటే చెప్పాలని ప్రశ్నించారు.

devineni uma
devineni uma

దేవినేని ఉమ ట్వీట్

వైకాపా ప్రభుత్వానికి వలసకూలీలు, కార్మికులు, పేదవాడి ఆకలి పరుగులు కనిపించడం లేదా అని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ నిలదీశారు. మూడుపూటలా పేదవాడి ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్​లు రద్దు చేశారని మండిపడ్డారు. తాడేపల్లి రాజప్రాసాదంలో ఉంటున్న ముఖ్యమంత్రి పేదవాడి ఆకలి తీర్చడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటో రికార్డెడ్ ప్రెస్ మీట్ ద్వారానైనా చెప్పాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details