ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటేలా.. జాతీయ ఓటరు అవగాహన పోటీలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ వెల్లడించారు. జాతీయ ఎన్నికల సంఘం నిర్వహించే ఈ పోటీల్లో అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున పాల్గొనేలా కృషి చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.
"ప్రజాస్వామ్య బలోపేతానికి.. జాతీయ ఓటరు అవగాహన పోటీలు" - vote awareness programme in vijayawada
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని.. "నా ఓటు - నా భవిష్యత్" అనే థీమ్తో అవగాహన పోటీలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ వెల్లడించారు. జాతీయ ఎన్నికల సంఘం నిర్వహించే ఈ పోటీల్లో అన్ని వర్గాల ప్రజలూ పెద్ద ఎత్తున పాల్గోనేలా కృషి చేయాలని జిల్లా అధికారులకు సూచించారు.
!["ప్రజాస్వామ్య బలోపేతానికి.. జాతీయ ఓటరు అవగాహన పోటీలు" vote awareness programme in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14430711-266-14430711-1644506643966.jpg)
vote awareness programme in vijayawada
ఈ పోటీల్లో భాగంగా.. క్విజ్, వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, పాట, నినాదం అనే ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో విజేతలుగా ఎంపికైన వారికి నగదు పురస్కారంతోపాటు ఈ-సర్టిఫికెట్ కూడా అందజేస్తామని తెలిపారు. ఆసక్తిగలవారు తమ ఎంట్రీలను మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు: కమిషనర్ అరుణ్కుమార్