రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడుపై వైకాపా ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ రఘురామకృష్ణరాజు ఘాటుగా స్పందించారు. మనిషికి ఉండే కనీస జ్ఞానం కొంత మందికి లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో తక్కువ, విశాఖలో ఎక్కువగా ఉండే విజయసాయిరెడ్డికి విశాఖలోనే మానసిక వైద్యం అందించాలని ఎద్దేవా చేశారు.
పరువు పోయింది...
విజయసాయిరెడ్డి వల్ల వైకాపా పరువు, సీఎం జగన్ పరువు దిల్లీలో పోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ హరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదమన్న రఘురామ... రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వారిపై వ్యాఖ్యలు చేసే మంత్రులకు, ఎంపీలకు రాజ్యాంగం గురించి అవగాహన తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.
సీరియస్గా పోరాడమని చెప్పండి...