ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా.. అణగారిన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం: వర్ల రామయ్య - వర్ల రామయ్య వార్తలు

వైకాపా ప్రభుత్వం ఎస్సీలపై కక్షసాధిస్తుందని వర్ల రామయ్య ఆరోపించారు. వైకాపా నేతలే ఎస్సీలపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. శిరోముండనం కేసులో వైకాపా నేత కృష్ణమూర్తిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎస్సీల ఓట్ల కోసం ఎన్నో హామీలిచ్చిన జగన్.. ఇప్పుడు కనీసం వారికి భద్రత కూడా కల్పించలేకపోతున్నారని విమర్శించారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య

By

Published : Jul 25, 2020, 11:35 PM IST

అణగారిన వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైకాపా.. ఇప్పుడు వారిపై దాడులు చేస్తుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. సీఎం జగన్ చెప్పేదొకటి చేసేదొకటని ఆయన మండిపడ్డారు. ఎస్సీలు ఓట్లు వేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా అన్న వర్ల.., ఆయనకు కొంచెం కూడా విశ్వాసం లేదని విమర్శించారు. ఎస్సీ యువకుడికి శిరోముండనం, ఎస్సీ బాలికపై అత్యాచారం జరిగితే చర్యలేందుకు తీసుకోలేదని మండిపడ్డారు.

మాస్కు పెట్టుకోలేదని ఓ ఎస్సీ యువకుడిని అన్యాయంగా చంపేశారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరోముండనానికి వైకాపా నేత కృష్ణమూర్తి కారణమని బాధితుడు వరప్రసాద్ తెలిపినా ప్రభుత్వం ఎందుకు కృష్ణమూర్తిని అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెట్టి తెదేపా నేతలను అరెస్టు చేయలేదా అని ఆరోపించారు.

ఇదీ చదవండి :రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details