భీమా కొరేగావ్ కేసు విచారణలో మహారాష్ట్రలోని తలోజా జైలులో వరవరరావు ఏడాదిన్నర నుంచి ఖైదీగా ఉంటున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతినడం వల్ల జైలు అధికారులు ముంబయిలోనే జేజే ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ జరిపిన పరీక్షల్లో వరవరరావుకు కరోనా సోకినట్లు తేలగా... సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చారు.
సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న వరవరరావు పరిస్థితి నిలకడగానే ఉందని, న్యూరోలాజికల్ సమస్యలు ఉన్నందున జేజే ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్ట్లు వరవరరావును పరిశీలించినట్లు తెలిపారు.