లాక్డౌన్ కారణంగా ఇరాన్లో చిక్కుకున్న వారిపై భారత నౌకాదశం దృష్టి సారించింది. అక్కడ ఉన్న భారతీయులను జలమార్గం ద్వారా భారత్కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా రప్పించేందుకు ప్రయత్నాలు మెుదలుపెట్టింది.
అప్పుడు శ్రీలంక, మాల్దీవులు ... ఇప్పుడు ఇరాన్ - సముద్ర సేతు వార్తలు
శ్రీలంక, మాల్దీవుల్లో చిక్కుకున్న వారిని భారత్కు చేర్చిన భారత నౌకాదళం ఇప్పుడు ఇరాన్పై దృష్టి పెట్టింది. అక్కడ ఉండిపోయిన భారతీయులను సొంత దేశానికి రప్పించేందుకు కసరత్తులు మెుదలుపెట్టింది.
![అప్పుడు శ్రీలంక, మాల్దీవులు ... ఇప్పుడు ఇరాన్ samudra sethu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7527574-204-7527574-1591611564284.jpg)
సముద్ర సేతు
ఇరాన్ రిపబ్లిక్లోని బందర్ అబ్బాస్ నౌకాశ్రయం నుంచి భారతీయులను తీసుకొని... ఐఎన్ఎస్ శార్దూల్ నౌక ద్వారా పోర్బందర్కు తీసుకురానుంది. అక్కడనుంచి వారందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి.. ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగా వారిని క్వారంటైన్కు తరలించనున్నారు.
ఇదీ చదవండి:స్వదేశానికి చేరుకున్న మరో 700 మంది భారతీయులు