అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్సూరెన్స్ దిగ్గజం మాస్మ్యూచువల్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో భాగ్యనగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన మరో అంతర్జాతీయ సంస్థ - మాస్మ్యూచువల్ పెట్టుబడులు వార్తలు
హైదరాబాద్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ఓ అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో భాగ్యనగరంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది.
హైదరాబాద్లో పెట్టుబడులు
అమెరికా వెలుపల తొలిసారిగా రూ.1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. మాస్మ్యూచువల్ పెట్టుబడులు రావడంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన ప్రముఖ బీఎఫ్ఎస్ఐ కంపెనీ మాస్మ్యూచువల్ విస్తరణలో భాగంగా హైదరాబాద్ను ఎంపిక చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.
ఇదీ చదవండి:మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం