ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు.. తెల్లారే సరికి నెత్తుటి మడుగులో! - wife and husband murder news

Wife and Husband Brutally Murdered: ఆ ఊళ్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో రక్తపాతం చోటుచేసుకుంది. కోడి కూతతో నిద్రలేవాల్సిన ఆ గ్రామం.. దంపతుల దారుణ హత్య వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. రక్తపు మడుగులో దంపతుల మృతదేహాలు పడి ఉండటం.. గ్రామస్థులను ఒక్కసారిగా షాక్​కు గురిచేసింది. అసలేమైంది..?

couple murder
couple murder

By

Published : May 11, 2022, 3:43 PM IST

Wife and Husband Brutally Murdered: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం చల్లపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న భార్యాభర్తలపై అర్ధరాత్రి.. కొందరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. రక్తపు మడుగులో దంపతుల మృతదేహాలు.. గ్రామస్థులకు ఆందోళన కలిగించాయి. ఘటనకు గల కారణాలేమిటో పోలీసులకు ఇంతవరకూ చిన్న క్లూ కూడా దొరకలేదు.

కొత్త సాంబయ్య(60), లక్ష్మీ(55) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఉన్నంతలో ముగ్గురి పెళ్లిళ్లూ ఏ లోటు లేకుండా చేశారు. పెళ్లయ్యాక కుమారుడు గ్రామంలోనే మరో ఇంట్లో వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తండ్రికి మందుల కోసం సాంబయ్య కుమారుడు.. మంగళవారం హైదరాబాద్​కు వెళ్లారు. వేసవికాలం కావడంతో సాంబయ్య.. మంగళవారం రాత్రి ఆరుబయట మంచంపై నిద్రిస్తున్నారు. లక్ష్మీ ఒక్కతే ఇంట్లో నిద్రపోతోంది. అర్ధరాత్రి దాటాక.. కొందరు గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దంపతులిద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరినీ ముఖంపై తీవ్రంగా దాడి చేయడంతో.. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.

ఉదయం యథావిధిగా నిద్రలేచిన ఇరుగుపొరుగు వాళ్లకు.. పక్కింట్లో సాంబయ్య, లక్ష్మీ మృతదేహాలు రక్తపు మడుగులో భీకరంగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్​ టీం, డాగ్​ స్క్వాడ్​ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details