ఎంఐఎం అంటే తెరాసకు భయమని.. ఆ పార్టీ నేత చెప్పినట్లే తెలంగాణ సీఎం కేసీఆర్ నడుచుకుంటారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) ఎద్దేవా చేశారు. మజ్లిస్కు భయపడే తెరాస ప్రభుత్వం సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం నిర్వహించలేదని ఆరోపించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన భాజపా బహిరంగ సభలో స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) పాల్గొన్నారు. తొలి దశ ప్రజా సంగ్రామ యాత్ర(Praja sangrama yatra) ముగిసినట్లు ఆమె ప్రకటించారు. ఆగష్టు 27న భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించారు. తొలిదశలో 36రోజుల పాటు ఈ యాత్ర సాగింది.
కొన్నేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని స్మృతి ఇరానీ(Smriti Irani in Husnabad meeting) ఆరోపించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 3వేల భృతి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తున్నామన్ని కేంద్ర మంత్రి(Smriti Irani in Husnabad meeting) .. రాష్ట్రంలో నిరుపేదలకు తెరాస ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి కొనుగోలు చేసేది కాదని.. మోదీ ప్రభుత్వం 70 వేల కోట్ల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందని వివరించారు.
కారు తెరాసది స్టీరింగ్ ఎంఐఎంది. మజ్లిస్ అధినేత ఎలా చెబితే కేసీఆర్ అలా నడుచుకుంటారు. కరోనా సంక్షోభంలోనూ దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ ఇచ్చింది. ఉచిత రేషన్తో పాటు మహిళలకు డబ్బులు ఇచ్చి ఆదుకుంది. పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు అండగా నిలిచాం. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్నాం. కానీ రాష్ట్రంలో నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఏమైనా సాయం చేశారా.?
-స్మృతి ఇరానీ, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి