Actual Revenue Deficit of AP : రాష్ట్రానికి సంబంధించి 2014-15 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటుపై కేంద్రం మళ్లీ ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆ ఏడాది రెవెన్యూ లోటును కేంద్రమే భరిస్తుందని విభజన హామీగా ఉంది. ఈ విషయంలో ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. విభజన హామీ ప్రకారం తొలి ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం తిరిగి ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. తాజాగా జనవరి నాల్గవ వారంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అందులో భాగంగానే కేంద్రం నుంచి వనరుల భర్తీకి ఇంకా రూ.18,830.87 కోట్లు రావాల్సి ఉందని కూడా పేర్కొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాది రెవెన్యూ లోటుపై పక్కా లెక్కలు అడిగినట్లు తెలిసింది. ఇందుకు అవసరమైన సమాచారం పంపాలని అన్ని ప్రభుత్వ విభాగాధిపతులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీనిపై మంగళవారం ఒక సమావేశం కూడా నిర్వహించారు.
ఇదీ సీఎస్ కోరిన సమాచారం...