ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 23, 2022, 9:46 AM IST

ETV Bharat / city

ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం, గర్భం దాల్చటంతో వెలుగులోకి

Gang Rape of a Minor Girl in Nellikuduru ఆరోతరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు మైనర్లు, ఓ మేజర్​ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వల్ల బాలిక గర్భం దాల్చటంతో అసలు విషయం బయటపడింది.

ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం
ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం

Gang Rape of a Minor Girl in Nellikuduru: 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇటీవలే.. ప్రభుత్వ విద్యాసంస్థలో 6 వ తరగతిలో ప్రవేశం పొందింది. కాగా.. బాలికపై ఇద్దరు మైనర్ బాలురు, ఓ వ్యక్తి కలిసి కొద్ది నెలల కిందట అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది.

విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని మహబూబాబాద్​లోని బాలికల సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఈ విషయంపై నెల్లికుదురు పోలీసులను వివరణ కోరగా సమాధానం దాటవేశారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details