కోవిడ్ బాధితుల చికిత్స కోసం రాష్ట్రంలో 22 జర్మన్ షెడ్ల నిర్మాణానికి తితిదే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండడం.. ఆసుపత్రులన్నీ కోవిడ్ భాదితులతో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రిలోనూ పడకల కొరత ఏర్పడడంతో.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు 3.52 కోట్లతో వివిధ ప్రాంతాల్లో షెడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వలు జారీ చేశారు.
ఇటీవల తిరుపతి శ్రీ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి వద్ద జర్మన్ షెడ్ నిర్మించి అందులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ విధానం చాలా ఉపయోగకరంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా షెడ్లు నిర్మించాలని తితిదేకి అనేక విజ్ఞప్తులొచ్చాయి. దీంతో ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదేశం మేరకు శ్రీ వేంకటేశ్వర సర్వ శ్రేయో నిధి నుంచి దీనికి అవసరమైన సొమ్మును తితిదే సమకూర్చింది.
జిల్లాల వారీగా నిర్మించనున్న జర్మన్ షెడ్లు..