ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 1, 2022, 10:51 PM IST

ETV Bharat / city

గవర్నర్, సీఎం​ను కలిసిన తితిదే ఛైర్మన్.. దేవస్థానం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

TTD Chairman meet CM Jagan: తితిదే నేతృత్వంలో అమరావతిలో నూతనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం నిర్మాణపనులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దేవస్థానం ప్రారంభోత్సవానికి హాజరుకావాలని సీఎం జగన్​, గవర్నర్ బిశ్వభూషణ్​ను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు.

yv subbareddy meet cm jagan and governor bishwabhushan
yv subbareddy meet cm jagan and governor bishwabhushan

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్​​ను తితిదే ఛైర్మర్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నేతృత్వంలో అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం ఇరువురికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ నెల 4వ తేదీ నుంచి అమరావతిలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే ఛైర్మన్ తెలిపారు.

ఇదీ చదవండి:జగన్​ కీలక నిర్ణయం.. వైకాపా నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్​

ABOUT THE AUTHOR

...view details