ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Revanth Interesting Comments: హరీశ్‌రావును ఇంటికి పంపేందుకు కేసీఆర్‌ ప్రణాళిక: రేవంత్‌

By

Published : Oct 18, 2021, 8:55 PM IST

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు (Revanth Reddy Interesting Comments) చేశారు. త్వరలో కేసీఆర్​ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని చెప్పారు. హరీశ్​ను ఇంటికి పంపే ప్లాన్ సిద్ధమైందన్నారు.

హరీశ్‌రావును ఇంటికి పంపేందుకు కేసీఆర్‌ ప్రణాళిక
హరీశ్‌రావును ఇంటికి పంపేందుకు కేసీఆర్‌ ప్రణాళిక

హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad by elections) తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Interesting Comments) జోస్యం చెప్పారు. 2022 ఆగష్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) కూడా జరుగుతాయని తెలిపారు. కేసీఆర్ (Cm Kcr) కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళతారని రేవంత్ అన్నారు. సీఎల్పీ కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి(Revanth Reddy Chitchat)గా మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావుకు చివరకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమేనన్నారు. హరీశ్​రావును పూర్తిగా ఇంటికి పంపే ప్రణాళికను కేసీఆర్ రెడీ చేశారని పేర్కొన్నారు.

తిరుగుబాటును ఎదుర్కోవడానికే కేసీఆర్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల చర్చ ఎందుకు తీసుకొచ్చారో కేసీఆరే చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకో రెండున్నరేళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ఎమ్మెల్యేలను భయపెడుతున్నట్లు వివరించారు. మళ్లీ తెరాస అధికారంలోకి వస్తోందని రెండేళ్ల ముందే కేసీఆర్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో భాజపాను బలోపేతం చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

అడగకుండానే...

అడగకుండానే దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఆశ చూపి కేసీఆర్ (Cm Kcr) తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఏబీసీడీ వర్గీకరణపై మందకృష్ట మాదిగ (Manda Krishna Madiga) 26 ఏళ్లుగా కొట్లాడుతున్నట్లు గుర్తుచేశారు. వర్గీకరణపై ప్రధాని మోదీ (Pm Modi) దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు సాగుకు యోగ్యమైన మూడెకరాల భూమి ఇస్తామని 2014 తెరాస మ్యానిఫెస్టోలో పొందుపరిచి మోసం చేసిందన్నారు. తెరాస అధ్యక్ష పదవికి కేసీఆర్.. నామినేషన్ ప్రక్రియలో ఒక్క దళిత నేతను కూడా భాగస్వామిని చేయలేదని (Revanth Interesting Comments) ఎత్తిచూపారు. కేసీఆర్​తో వేదిక పంచుకోవటానికి ఎంపీ రాములు, కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్​లాంటి వాళ్లు పనికిరారా అని ప్రశ్నించారు. కేసీఆర్ దళితులను నమ్మడని.. దళితులు కూడా కేసీఆర్​ను నమ్మడం లేదన్నారు.

ఇదీ చూడండి:CM Jagan review on power: థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details