- ముందుకెళ్లొద్దని చెప్పండి
సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిశీలించేంత వరకు కొత్త ప్రాజెక్టు పథకంపై ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లకుండా ప్రాజెక్టు పనులు ఆపేయాలని ఏపీని కోరాలని కృష్ణా బోర్డుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పినట్లు వెల్లడించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- ఆ అవసరం ఉంది..
విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రమాదం కారణంగా పర్యావరణానికి జరిగిన నష్టాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఎన్జీటీ ఏర్పాటు చేసిన కమిటీ ఛైర్మన్ విశాంత్ర న్యాయమూర్తి జస్టిస్ శేషనయనారెడ్డి అన్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
- అలుపుండదా..?
ఉన్న ఊరు పనిలేదు పొమ్మంటోంది... సొంతూరు రా రమ్మంటోంది... అందుకే... పదులు, వందలు, వేల కిలోమీటర్లు ఇలా దూరం ఎందాకైనా కాళ్లే చక్రాలుగా మార్చుకుని వలస కూలీలు కదిలి వెళ్తున్నారు. మరి వలస జీవుల్లో ఆ సత్తువ ఎక్కడిది.. అంత దూరం నడిచి వెళ్లాలనే ఆత్రం ఎందుకు? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- సర్వత్రా ఉత్కంఠ
కరోనా కట్టడికి విధించిన మూడో విడత లాక్డౌన్ నేటితో పూర్తికానుంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే లాక్డౌన్ 4.0లో నిబంధనలు కొత్తగా ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈసారి రూల్స్ ఎలా ఉంటాయి? వేటికి అనుమతి ఉంటుంది? ఏ ఆంక్షలు కొనసాగుతాయే అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...
- తబ్లిగీల అరెస్ట్
మధ్యప్రదేశ్ భోపాల్లో 60 మంది తబ్లిగీ జమాత్ సంస్థకు చెందిన విదేశీయులను అరెస్ట్ చేశారు పోలీసులు. పర్యటక వీసాపై వచ్చి.. మతరపమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించామన్నారు. విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు తెలిపారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి