ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 9 AM

.

By

Published : Sep 16, 2020, 9:01 AM IST

Top News @ 9 AM
ప్రధాన వార్తలు@ 9 AM

  • రాజధాని భూముల కేసుపై ఏపీ హైకోర్టు స్టే

ఏపీ రాజధాని భూములకు సంబంధించి అవినీతి నిరోధకశాఖ (అనిశా) నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు నిందితులపై విచారణ, దర్యాప్తులను నిలిపివేసింది. ఎఫ్‌ఐఆర్‌ వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాల ద్వారా బహిర్గతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు... దెబ్బతిన్న పంటలు

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో సీమ ప్రాంతంలోని ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటికి సంబంధించిన లెక్కలను వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇవాళ, రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రేపటి నుంచే ఏపీ ఎంసెట్.. విస్తృతంగా ఏర్పాట్లు

గురువారం నుంచి ఏపీ ఎంసెట్ ప్రారంభం కానుంది. ఏపీ, తెలంగాణలో కలిపి 118 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రవేశ పరీక్షల ప్రత్యేకాధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విజయవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల ప్రతిమలు అదృశ్యం?

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాలపై వస్తున్న వార్తలు దేవాలయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతర్వేది ఘటన తర్వాత రథాల పరిశీలన, భద్రత అంశాలపై పోలీసులు ఈనెల 13న సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో వెండి రథాన్ని అధికారులు పరిశీలించగా... సింహాల ప్రతిమ కనపడలేదన విషయాన్ని గుర్తించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ప్లాస్మా థెరపీతో మరణాలు తగ్గలేదు'

భారత్​లో కరోనా మరణాలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు భారతీయ వైద్య పరిశోధన మండలి డైరెక్టర్​ జనరల్​ బలరాం భార్గవ. ఒకసారి కరోనా వచ్చినవారికి రెండోసారి వైరస్​ సోకే ముప్పు చాలా తక్కువని స్పష్టం చేశారు. అయితే ప్లాస్మా థెరపీ వల్ల కొవిడ్​ మరణాలు తగ్గలేదని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!

లద్దాఖ్​లో ఉద్రిక్తతల వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధమవుతోంది. చలికాలంలోనూ సైనిక స్థావరాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆహారం, దుస్తులు, ఇంధనం సరఫరా చేస్తోంది. వాయుసేన సైతం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సామాగ్రి చేరవేసేందుకు చిన్నపాటి ఎయిర్​బేస్ ఏర్పాటుకు పనులు ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆక్స్​ఫర్డ్ టీకా ట్రయల్స్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్

దేశంలో ఆక్స్​ఫర్డ్ టీకా క్లినికల్ ట్రయల్స్ పునఃప్రారంభించేందుకు డీసీజీఐ అంగీకరించింది. అయితే ట్రయల్స్ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సూచించింది. ప్రతికూల పరిస్థితుల్లో పర్యవేక్షణ మరింత పెంచాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • అమెరికాలో 2 లక్షలు దాటిన కొవిడ్​ మరణాలు

ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 97 లక్షలు దాటింది. 9 లక్షల 38 వేలమందికిపైగా మృతి చెందారు. మరోవైపు రికవరీల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఈ ఐపీఎల్​లో బౌలర్లదే హవా.. భారీ స్కోర్లు కష్టమే'

ప్రస్తుత ఐపీఎల్​లో మొత్తం బౌలర్ల హవానే సాగుతుందని అభిప్రాయపడ్డాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు మార్గనిర్దేశకుడు వీవీఎస్​ లక్ష్మణ్​. దాదాపు ఐదు నెలలు విరామం వచ్చినా.. ఆటగాళ్లందరూ ఫిట్​గా ఉండటం చూస్తే ఆశ్చర్యమేసిందని తెలిపాడు. టోర్నీ కోసం క్రికెటర్లంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారని ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'దక్షిణాది చిత్రాలకు ఓకే..బాలీవుడ్​కు వెళ్లను'

ప్రస్తుతం హిందీ చిత్రాల్లో నటించే ఆలోచనే లేదంటోంది నటి రాశీ ఖన్నా. దక్షిణాది ప్రేక్షకులు తనను విశేషంగా ఆదరిస్తున్నారని చెబుతోంది. నటిగా సినీప్రయాణం సంతోషకరంగా సాగుతుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details