ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @9AM

...

By

Published : Jun 24, 2020, 9:01 AM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

  • వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి నేడే శ్రీకారం..

వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు చొప్పున అందజేయనున్నారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే వీటిని జమచేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 'ఏపీహెచ్​ఆర్సీ ఏర్పాటుపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం'

ఏపీ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు విషయంలో కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదని ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి బి.మోహనరావు ఆరోపించారు. ఈ మేరకు కమిషన్ ఏర్పాటు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • డిగ్రీ, పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు!

డిగ్రీ, పీజీ, బీటెక్‌, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేయాలనే అభిప్రాయం వర్సిటీల వీసీల సమావేశంలో వ్యక్తమైంది. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని పలువురు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు వివరించి పరీక్షల రద్దుపై అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వారిలా .. నేను ప్రవర్తించలేను!

వైకాపా నేతల వ్యాఖ్యలపై భాజపా నేత సుజనా చౌదరి మండిపడ్డారు. మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, రమేశ్‌ కుమార్‌ వేర్వేరు అంశాల పై విడివిడిగా కలిశారని..దానిని రాజకీయాలతో ముడిపెట్టవద్దని అన్నారు. నలుగురు కలసి మాట్లాడుకుంటే కుట్రలు చేయడమే అనుకోవడం వారి దిగజారిన స్థాయిని తెలుపుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 11 గంటల చర్చ ఎందుకంటే?..

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​- చైనా సైనికాధికారుల నడుమ జరిగిన చర్చలు శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేలా ఉన్నాయి. ఇందుకోసం సోమవారం రెండుదేశాల అగ్రశ్రేణి కమాండర్ల మధ్య ఏకంగా 11 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరగడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఆయన చేతుల్లోనే దేశం భద్రం!

సీ-ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో 72.6 శాతం మంది ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే దేశం భద్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 68 శాతం మంది ప్రజలు పాకిస్థాన్​ కంటే చైనా నుంచే భారత్​కు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పాలస్తీనా శరణార్థుల కోసం భారత్​ భారీ సాయం..

పశ్చిమాసియా ప్రాంతంలోని పాలస్తీనా శరణార్థులకు భారీ సాయం ప్రకటించింది భారత్​. వచ్చే రెండేళ్లలో ఐక్యరాజ్య సమితికి చెందిన రిలీఫ్​ అండ్​ వర్క్ ఏజెన్సీ (యూఎన్​ఆర్​డబ్ల్యూఏ)కు 10 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సీపీఎల్​ నుంచి తప్పుకున్న గేల్​..

ఈ ఏడాది కరేబియన్​ ప్రీమియర్​ లీగ్​(సీపీఎల్​)కు దూరమవుతున్నట్లు వెస్టిండీస్​ విధ్వంసకర బ్యాట్స్​మెన్​​ క్రిస్​ గేల్ ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఆటగాళ్లను ఎంపిక చేసే ఒక రోజు ముందు గేల్​ ఈ ప్రకటన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • లేడీ సూపర్​స్టార్ పుట్టినరోజు...

రాములమ్మగా అందరి మదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, నాయకురాలు విజయశాంతి పుట్టినరోజు నేడు. 'కర్తవ్యం' సినిమాకుగానూ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నా ఆమె... దక్షిణాది సినిమాల్లో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. 'లేడీ అమితాబ్​ బచ్చన్'​గా పేరు తెచ్చుకున్న విజయశాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • నటుడు మురళీ మోహన్ జన్మదినం..

సినిమాతో పాటు వివిధ రంగాల్లో తనదైన ముద్రవేశారు టాలీవుడ్​ సీనియర్​ నటుడు మురళీ మోహన్. నేడు (జూన్​ 24) మురళీ మోహన్​ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక కథనం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details