ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

..

By

Published : Jun 19, 2020, 7:00 PM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

  • వైకాపా అభ్యర్థుల విజయం

రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ గెలుపొందారు. కాసేపట్లో అధికారికంగా రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • వారిద్దరూ పోలీసు కస్టడీకి ..

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌ కేసులో కడప జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌రెడ్డిని పోలీసు కస్టడీకి అనంతపురం కోర్టు అనుమతించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జగన్​కు అమ్ముడుపోయి...

జగన్ బూట్లు నాకేందుకే.. కన్నతల్లి లాంటి పార్టీపై, చంద్రబాబుపై వల్లభనేని వంశీ, మద్దాలి గిరి విమర్శలు చేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • శాంతి చర్చలు ఇక ముగిసినట్టేనా?

సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​-చైనా మధ్య మేజర్ జనరల్స్ స్థాయిలో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇరుదేశాల సైనికులు ఆవేశంతో ఉన్న నేపథ్యంలో భవిష్యత్​ చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అఖిలపక్ష భేటి..

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితిపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పెద్దలసభ ఫలితాలు..

రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్​లో కాంగ్రెస్​ 2 స్థానాలను గెలుపొందగా.. భాజపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్​లో భాజపా 2 సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్​ ఒక స్థానాన్ని దక్కించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • భారత్​కే మద్దతు..

భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తతల వేళ కీలక వ్యాఖ్యలు చేశారు టిబెట్​ అధ్యక్షుడు లోబ్సాంగ్​ సంగయ్​. భారతదేశ ప్రాదేశిక సౌర్వభౌమాధికారం, సమగ్రతను.. చైనా గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 100 కోట్ల చిన్నారులపై హింస..

సరైన రక్షణ చర్యలు లేక ఏటా సుమారు వందకోట్ల మంది చిన్నారులు హింసకు గురవుతున్నారని ఐరాస ఓ నివేదికలో తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గాయకుడు ఏఎల్ రాఘవన్ మృతి..

తమిళ నటుడు, నేపథ్య గాయకుడు ఏఎల్ రాఘవన్.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన గతంలో దిగ్గజ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల్లోనూ పాటలు పాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 1000 ఖేలో ఇండియా కేంద్రాలు..

భారత్​లో 1000 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. క్రీడల్లో మనదేశాన్ని సూపర్​పవర్​గా మార్చే పోరాటంలో భాగంగానే వీటిని ప్రారంభించబోతున్నట్లు కేంద్రక్రీడా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details