ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Jan 27, 2021, 11:00 AM IST

top news etv bharat
top news etv bharat

  • గవర్నర్​తో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ భేటీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్​ గవర్నర్‌ను కలిశారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. అధికారులపై క్రమశిక్షణ చర్యల్ని గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • రాష్ట్రంలో 2 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు... ఆ జిల్లాలోనే అత్యధికం!

రాష్ట్రంలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల్లో రెండు కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు జాబితా సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్​ కు ఉన్నతాధికారులు నివేదించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • చోరీ సొత్తులో... రాబట్టింది సగమే!

రాష్ట్రంలో దోపిడీలు, దొంగతనాలు, కొల్లగొట్టడాలు తదితర నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొత్తులో సగమే స్వాధీనం అవుతోంది. రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య మొత్తం రూ.718.19 కోట్ల సొత్తు దొంగలపాలైంది. అందులో రూ.319.63 కోట్లనే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. అంటే తిరిగి రాబట్టగలిగింది 44.50 శాతమే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • ఇది సిక్కుల ఉద్యమం కాదు.. రైతు ఉద్యమం: టికైత్​

ట్రాక్టర్​ ర్యాలీలో హింసాత్మక ఘటనలకు పాల్పడి, పోలీసుల బారికేడ్లు ధ్వంసం చేసిన వారు ఇకపై ఉద్యమంలో భాగం కాలేరని భారత్​ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికైత్​ తేల్చి చెప్పారు. ఎర్రకోటపై జెండాలు ఎగురవేసిన వారు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • గణతంత్ర​ పరేడ్​'పై 22 ఎఫ్​ఐఆర్​లు.. భద్రత కట్టుదిట్టం

దిల్లీ సరిహద్దులో మంగళవారం రైతులు నిర్వహించిన గణతంత్ర పరేడ్​లో హింసాత్మక ఘటనలపై పోలీసులు 22 ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు. 153 మంది పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • దేశంలో మరో 12,689 కరోనా కేసులు

దేశంలో మరో 12,689 మందికి కరోనా సోకింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 137 మంది మృతిచెందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 లక్షల 29 వేల మందికిపైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • బ్రిటన్​లో లక్ష మార్క్​ దాటిన కరోనా మరణాలు

ప్రపంచ దేశాలపై కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 10కోట్ల 8లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. వారిలో 21లక్షల 65 వేల మంది కొవిడ్​కు బలయ్యారు. బ్రిటన్​లో మరణాల సంఖ్య లక్ష మార్క్​ దాటింది. అటు అమెరికా, బ్రెజిల్​, స్పెయిన్​లలో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • అదనపు ఆదాయమంతా కేంద్రానికే!

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఖర్చును భరించడానికి కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో కొత్త సెస్సులు విధించే అవకాశం ఉంది. అయితే సెస్సుల ద్వారా వచ్చే అదనపు ఆదాయమంతా కేంద్రానికే చేరుతోంది తప్ప రాష్ట్రాలకు ఏమీ మిగలడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సెస్సులపై రాష్ట్రాలు ఎందుకు అభ్యంతరం చెప్తున్నాయి? కేంద్రం మార్చుకోవాల్సిన విధానాలు ఏమిటి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • రూట్​ జోరును కోహ్లీసేన ఆపగలదా?

శ్రీలంకపై విజయంతో ఫుల్​జోష్​ మీద ఉంది ఇంగ్లాండ్​. అయితే ఈ సిరీస్​ కైవసం చేసుకోవడంలో ఇంగ్లీష్​ జట్టు సారథి జో రూట్​ బాదిన శతకాలే కీలకం. ఇదే జోరుతో టీమ్ఇండియాను ఢీ కొట్టడానికి భారత పర్యటనకు రానున్నాడు. మరి కోహ్లీ సేన ఇతడిని ఆపగలదా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • మెగాస్టార్ 'ఆచార్య' టీజర్​ అప్​డేట్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. తాజాగా ఈ సినిమా టీజర్​పై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details