- 'కరోనాను జయించటమే ప్రతిఒక్కరి ధ్యేయం కావాలి'
కరోనాను జయించటమే ప్రతిఒక్కరి ధ్యేయం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా సమయంలో అంతా సమైక్యంగా ఉండి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ పరంగా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు, సూచనలు ఉంచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. ఉప్పు ఎగుమతులకు అధికారుల అనుమతి
కరోనా కష్టకాలంలో ఉప్పు పరిశ్రమ వేలాది మంది కూలీలను అదుకుంటోంది. లాక్ డౌన్ నిబంధనల కారణంగా కూలీలకు జీవనోపాధి కూడా కష్టంగా మారటంతో... వారు పడుతున్న ఇబ్బందులు... ఏప్రిల్ 18న " కరోనా దెబ్బతో నష్టపోతున్న ఉప్పు రైతులు" ఈటీవీ జైకిసాన్, ఈటీవీ భారత్ లలో కథనం ప్రసారమైంది. దీంతో అధికారులు స్పందించి ఉప్పు ఎగుమతులకు అనుమతులిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- ఏఓబీలో మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు..పోలీసుల కూంబింగ్ ముమ్మరం
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించనుండటంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్ర నాయకులు సరిహద్దులకు చేరుకున్నారన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. దీంతో సరిహద్దు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- హుండీ ఆదాయం రూ.50 లక్షలే!
కరోనా ప్రభావం శ్రీవారి హుండీ ఆదాయంపై పడింది. సాధారణ రోజుల్లో రోజుకు రూ.3 కోట్లు వచ్చే హుండీ ఆదాయం.. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 లక్షలు మాత్రమే వస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- శాస్త్రీయ పరిశోధనలకు భారత్-బ్రిటన్ మధ్య ఒప్పందం
యాంటీ మైక్రాబియల్ రెసిస్టెన్స్ పరిశోధనలకు సంబంధించి ఐదు కీలక ప్రాజెక్టులను జరపనున్నాయి భారత్-బ్రిటన్. ఈ పరిశోధనల విలువ 8 మిలియన్ పౌండ్లగా బ్రటీష్ హై కమిషన్ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చెయ్యండి.
- కాంగ్రెస్పై మాయ ఫైర్.. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు!