ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

By

Published : Jun 21, 2020, 9:01 PM IST

ప్రధాన వార్తలు@9PM
ప్రధాన వార్తలు@9PM

  • 'నాకు ప్రాణహాని ఉంది..రక్షణ కల్పించండి'

తనకు ప్రాణహాని ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాలకు నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు లేఖలు రాశారు. కేంద్ర భద్రతా సిబ్బందితో రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపినందుకు తనపై దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • 'రాజధాని మార్పు గురించి ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు'

కరోనాతో రాజధాని మార్పు గురించి ప్రస్తుతం ఆలోచించే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక..సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధాని తరలింపు అంశం గవర్నర్ కూడా చెప్పారన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • 'చేనేతలకు జగన్ ద్రోహం చేస్తున్నారు'

చేనేతలకు ముఖ్యమంత్రి జగన్ ద్రోహం చేస్తున్నారని మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప విమర్శించారు. రాష్ట్రంలో 81 వేల మందికే పథకం ద్వారా లబ్ధిచేకూర్చుతున్నారన్నారు. మెుత్తం 3.5 లక్షల మంది చేనేత వృత్తిదారులకూ పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • నకిలీ ఎస్సై... యువతిని మోసం చేశాడు..!

తాను ఎస్సై ఉద్యోగం చేస్తున్నానంటూ... యువతికి కుచ్చుటోపి పెట్టాడు ఓ మోసగాడు. డిపార్ట్​మెంట్​లో దొర్లిన చిన్న తప్పిదం కారణంగా ఇటీవల సస్పెండ్​కు గురయ్యానంటూ నమ్మబలికాడు. ఇంటి వద్దే ఉంటూ సివిల్స్​కు ప్రిపేర్​ అవుతున్నానని అబద్ధాలు చెప్పాడు. యువతిని పెళ్లి చేసుకొని ఆమె కుటుంబం నుంచి 20 లక్షల కట్నం తీసుకున్నాడు.పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • హైదరాబాద్ నుంచి కరోనా మందు

కొవిడ్-19 చికిత్సకు సంబంధించి దేశంలోనే మొదటి జెనరిక్ ఔషధం రెమ్‌డెసివిర్​ (కొవిఫోర్) తయారీకి తమ సంస్థకు ఆమోదం లభించినట్లు ప్రముఖ మందుల తయారీ సంస్థ హెటెరో ప్రకటించింది. మరో వారం రోజుల్లో డ్రగ్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • 20 హత్యల సైనైడ్​ మోహన్​కు శిక్ష!

సీరియల్ కిల్లర్​ సైనైడ్​ మోహన్​ను 20వ హత్య కేసులోనూ దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈనెల 24న శిక్ష ఖరారు చేసే అవకాశముంది. 2009లో కేరళ కాసర్​గోడ్​లో ఓ యువతిని మోసగించి, చంపింది అతడేనని నిర్ధరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • సరిహద్దు వివాదంపై నేపాల్​ వైఖరికి కారణమేంటి?

సరిహద్దు విషయంలో చైనాతో పాటు నేపాల్​ కూడా భారత్​కు సవాళ్లు విసురుతోంది. అయితే చైనా అండతోనే నేపాల్​ భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోందని అనేక మంది భావిస్తున్నారు. ఇందులో నిజమెంత? నేపాల్​ అనూహ్య వైఖరితో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి సంబంధం ఉందా? నేపాల్​ను తక్కువ అంచనా వేయడమే ఇందుకు కారణమా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • కన్న తండ్రే బిడ్డను విసిరేస్తే...

ఫాదర్స్​ డే అని ఓ వైపు గొప్పగా సంబరాలు జరుపుకుంటుంటే.. దానికి విలువ లేకుండా చేశాడో తండ్రి. లాలించి, బుజ్జగించాల్సిన ఆ చేతులతో.. కన్న కూతురని చూడకుండా కొట్టి, మంచం పైనుంచి విసిరేశాడు. రెండు నెలలైనా నిండని ఆ పసిపాప.. ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • 'క్రికెటర్లూ.. అప్పటికి దెబ్బలేం తగిలించుకోకండి'

క్రికెట్​ పునఃప్రారంభమయ్యేసరికి ఆటగాళ్లందరూ మానసికంగా దృఢంగా తయారవ్వాలని సూచించారు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​​ సందీప్​ పాటిల్​. శరీరానికి ఎటువంటి గాయాలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

  • యోగాసనాలు నేర్పిస్తున్నమంచు లక్ష్మి

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నటీనటులు వివిధ యోగాసనాలను ప్రదర్శిస్తూ అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లోని తన నివాసంలో నటి, నిర్మాత మంచు లక్ష్మి యోగా చేశారు. తన దినచర్యలో వ్యాయామం ఒక భాగమని ఈ సందర్భంగా తెలిపారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా తోడ్పడుతుందని ఆమె వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details