ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 AM

ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : Jun 11, 2021, 8:59 AM IST

Top News @ 9 AM
Top News @ 9 AM

  • Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
    ఈ రోజు మీ రాశి ఫలాల గురించి తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాజధాని వికేంద్రీకరణ, అభివృద్ధికి సహకరించండి: సీఎం జగన్​
    రాష్ట్ర అభివృద్ది, రాజధాని వికేంద్రీకరణకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్​ మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని.. హైకోర్టును కర్నూలు తరలించేందుకు రీ నోటిఫికేషన్​ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ముఖ్యమంత్రి కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ఎమ్మెల్సీలుగా నలుగురు.. నేడో, రేపో గవర్నర్ ఆమోదం!
    గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోసేను రాజు, తోట త్రిమూర్తులు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డి పేర్లతో కూడిన తుది జాబితాను గవర్నర్ ఆమోదం కోసం ప్రభుత్వం పంపినట్లు సమచారం. నేడో, రేపో ఈ దస్త్రానికి ఆమోదముద్ర పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు
    తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు. తితిదే ఛైర్మన్‌, ఈవో, ఆలయ అర్చకులు.. వారికి ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • Baba Ramdev: 'నేనూ కొవిడ్ టీకా వేసుకుంటా'
    టీకా అవసరం లేదని ఇంతకాలం చెబుతూ వచ్చిన యోగా గురు బాబా రాందేవ్ యూటర్న్ తీసుకున్నారు. తాను టీకా వేసుకుంటానని, అందరూ తప్పక రెండు డోసులు వేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • 50 అడుగుల బోరుబావిలో చిన్నారి.. చివరికి!
    మహారాష్ట్ర రామ్​టెక్​లో.. పశువులు కాస్తున్న తండ్రితో వెళ్లి పొరపాటున బోరుబావిలో పడ్డ చిన్నారిని గ్రామస్థులు బయటకు తీశారు. అధికారులు చేరుకోకముందే వారంతా కలసి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయడం విశేషం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Astrazeneca: టీకాతో అతికొద్దిమందిలో ఆ సమస్య!
    ఆస్ట్రాజెనెకా టీకా వల్ల రక్తానికి సంబంధించిన ఓ సమస్య ఉత్పన్నం కావొచ్చని బ్రిటన్ శాస్త్త్రవేత్తల్లు ఓ అధ్యయనంలో తేల్చారు. అయితే.. ఈ సమస్య అతికొద్దిమందిలోనే వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ఏటీఎం లావాదేవీలు ఇక మరింత భారం
    2022 జనవరి 1 నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహణకు వ్యయాలు పెరగడం, సాధారణ ఖర్చులకుగాను ఈమేరకు వినియోగదారు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఆర్​బీఐ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • Racism in Cricket: మోకాళ్లపై సంఘీభావం తెలిపితే సరిపోదు!
    జాతివివక్ష వ్యతిరేక ఉద్యమాని(Black Lives Matter)కి కొత్త పంథా అవసరమని వెస్టిండీస్​ ఆల్​రౌండర్​ జేసన్​ హోల్డర్(Jason Holder) అన్నాడు. క్రికెట్​లో మ్యాచ్​లకు ముందు మోకాళ్లపై నిలబడి సంఘీభావం తెలపడమే కాకుండా.. ఉద్యమాన్ని ప్రేరేపించేందుకు కొత్త ఆలోచన కావాలని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
  • ఇష్టం కాదు ఆమెనే ప్రేమిస్తున్నా: వైష్ణవ్​తేజ్
    అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించిన యువహీరో వైష్ణవ్​తేజ్(vaishnav tej).. తన కెరీర్, వ్యక్తిగత అంశాలతో పాటు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details