ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 8, 2020, 3:05 PM IST

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM

.

Top News @ 3 PM
Top News @ 3 PM

  • నిమ్మగడ్డ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనను తిరస్కరించిన సీజేఐ

నిమ్మగడ్డ రమేశ్‌ను ఎస్​ఈసీగా పునర్నియమిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసిన నేపథ్యంలో... మధ్యంతరంగా ఎస్​ఈసీని నియమించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 1,062 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 22, 259కి చేరాయి. వైరస్ కారణంగా... మరో 12 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 264కి చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తెనాలిలో కరోనాతో వైద్యుడు మృతి.. వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి

కరోనా వైరస్​తో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఆర్​ఎంవో మృతిచెందారు. 4 రోజులక్రితం ఆయనకు వైరస్ సోకగా చికిత్స పొందుతూ మరణించారు. నియోజకవర్గంలో రోజురోజుకూ మహమ్మారి విజృంభిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అచ్చెన్నాయుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు హైకోర్టు అనుమతి

అచ్చెన్నాయుడిని విజయవాడ, గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించే అంశంపై వాదనలు విన్న ధర్మాసనం.. గుంటూరులోని ఓ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇచ్చింది పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'మహా' సంకీర్ణంలో సునామీ- త్వరలో కుప్పకూలే దిశగా!

మహారాష్ట్రలో కొలువుదీరిన మూడుపార్టీల సర్కారు త్వరలోనే కూలిపోనుందా? భాజపా వంటి బయటి శక్తుల ప్రభావం లేకుండానే ప్రభుత్వం పడిపోనుందా? సంకీర్ణ ధర్మం కనుమరుగవడం వల్ల ఠాక్రే పీఠానికి బీటలు వారుతున్నాయా? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గల్వాన్ నుంచి పూర్తిస్థాయిలో చైనా బలగాల ఉపసంహరణ

గల్వాన్ లోయ నుంచి పూర్తిస్థాయిలో వెనక్కి తరలాయి చైనా బలగాలు. పాట్రోలింగ్ పాయింట్ 15 నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లాయని సమాచారం. ప్రతిగా భారత సైన్యం కూడా బలగాల ఉపసంహరణ చేపట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆకాశవీధిలో 100ఎంబీపీఎస్​ నెట్- చైనా ప్రయోగం

పొరుగుదేశం చైనా సాంకేతిక పరిజ్ఞానంలో మరో అడుగు ముందుకేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన హైస్పీడ్ అంతర్జాల వ్యవస్థతో మొట్టమొదటి విమానాన్ని పరీక్షించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • గాలి ద్వారానూ కరోనా.. కొట్టిపారేయలేం: డబ్ల్యూహెచ్‌ఓ

గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే వాదనను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. అయితే, మరింత పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'దాదా' సారథ్యంలో టీమ్​ఇండియా ఘనతలెన్నో

సౌరభ్ గంగూలీ సారథ్యంలో టీమ్​ఇండియా ఎన్నో విజయాలు సాధించింది. భారత జట్టును ముందుండి నడిపించి.. క్రికెట్​ ప్రపంచంలో మరో స్థాయికి తీసుకెళ్లేందుకు దాదా ఎంతో కృషి చేశాడు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అభిమానులకు హీరోయిన్ రష్మిక క్రేజీ ప్రశ్నలు

లాక్​డౌన్​తో మార్చి రెండోవారం నుంచి దేశం స్తంభించింది. అన్ని కారక్రమాలతో పాటు సినిమా షూటింగ్​లు నిలిచిపోయాయి. ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.​ కొందరు ఇంట్లోనే వ్యాయామం, వంట పనులతో అభిమానులకు టచ్​లో ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details