ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 7PM - breaking news

...

ప్రధాన వార్తలు
TOP NEWS

By

Published : Sep 9, 2021, 7:01 PM IST

  • వైఎస్‌ వివేకా హత్యకేసులో మరో నిందితుడు అరెస్టు..

వైఎస్‌ వివేకా హత్యకేసులో మరో నిందితుడు అరెస్టు చేశారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కుంచేకులవాసి ఉమాశంకర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశాపు. ​పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • BANKERS MEETING: బ్యాంకర్లతో సీఎం సమావేశం.. రుణ ప్రణాళికపై చర్చ

సీఎం జగన్​ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Lokesh: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు: లోకేశ్‌

దిశ చట్టం తెచ్చామని ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లవుతున్నా రాష్ట్రంలోని మహిళలకు భద్రత లేకుండా పోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 21 రోజులు కాదు కదా.. 21 నెలలైనా నేరస్థులకు శిక్ష పడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • HIGH COURT: బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేం: హైకోర్టు

పబ్లిక్‌ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేమని రాష్ట్ర హైకోర్టు(high court) స్పష్టం చేసింది. కొవిడ్‌ దృష్ట్యా పబ్లిక్‌ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే గణేశ్​ ఉత్సవాలు జరుపుకోవాలని పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • RAPE CASE: 'నా భర్తను శిక్షించండి.. కూతురికి న్యాయం చేయండి'

కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడినందుకు తన భర్తను కఠినంగా శిక్షించాలని బాధిత బాలిక తల్లి కోరింది. తనపై కేసు వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని తెలిపింది. దిశ చట్టం కింద తన కూతురికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. తనను వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​ అధ్యక్షతన 13వ బ్రిక్స్​ సదస్సు.. మోదీ హాజరు

బ్రిక్స్​ దేశాల 13వ శిఖరాగ్ర సమావేశం గురువారం భారత్​ అధ్యక్షతన జరిగింది. భేటీలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో బ్రిక్స్​ సాధించిన ఘనతల పట్ల గర్వపడుతున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Taliban news: అఫ్గాన్​ సంక్షోభానికి తాలిబన్ల 'ఆజ్యం'

తాలిబన్ల అరాచక పాలనతో అఫ్గాన్​ సంక్షోభం మరింత ముదిరింది. ప్రభుత్వాన్ని(taliban government) ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మహిళల నిరసనలపై ఉక్కుపాదం మోపారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రిలయన్స్ కొత్త వ్యాపారం- ఈసారి మహిళల కోసం...

రిలయన్స్​ రిటైల్(Reliance retail)​ సంస్థ.. మహిళల కోసం ప్రత్యేక డిజైన్లలో దుస్తులు లభించే ఓ స్టోర్​ను బెంగళూరులో ప్రారంభించింది. 'అవంత్ర బై ట్రెండ్స్'(Avantra Trends)​ పేరుతో దీన్ని ఏర్పాటు చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • T20 వరల్డ్​కప్ కోసం ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా జట్లు ఇవే

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) పాల్గొననున్న తమ జట్లను ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి. అక్టోబరు 17 నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'Plan B' movie telugu: 'ఈ సినిమాలో అందరూ హీరోలే'

థ్రిల్లర్ కథతో తెరకెక్కిన 'ప్లాన్ బీ' సినిమా.. సెప్టెంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రబృందం.. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని చెప్పింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details