ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పల్లె పోరు: నేటితో ముగియనున్న రెండో దశ నామినేషన్ల స్వీకరణ - ap panchayat elections 2021

పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల ప్రక్రియ బుధవారం జోరుగా సాగింది. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ల నామపత్రాల సమర్పణతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. రెండో రోజు మొత్తం 25,576 నామినేషన్లు వేయగా.. వీటిలో సర్పంచ్‌ స్థానాలకు 50 81 , వార్డు స్థానాలకు 20,495 నామపత్రాలు దాఖలయ్యాయి. నేటితో రెండ దశ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

ఏపీ స్థానిక ఎన్నికలు 2021
ap local polls 2021

By

Published : Feb 4, 2021, 3:59 AM IST

పల్లె పోరులో రెండో దశ నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బుధవారం మొత్తం 25,576 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్‌ స్థానాలకు 50 81 , వార్డు స్థానాలకు 20,495 నామినేషన్లు వేశారు. ఇవాళ్టితో రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.

విజయనగరం జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్వతీపురం డివిజన్‌లో 749 మంది సర్పంచ్‌ స్థానాలకు, 2,195 మంది వార్డు స్థానాలకు నామినేషన్‌ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌లో సర్పంచ్‌ పదవికి 214, వార్డు పదవులకు 952 మంది నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్‌లో సర్పంచ్‌ పదవులకు 601 మంది, వార్డు స్థానాలకు 12 వందల 95 మంది నామినేషన్లు వేశారు. అధికారులు నామపత్రాలు తీసుకోవడం లేదంటూ.. ఎంపీడీవో కార్యాలయం వద్ద కోళ్లబైలు పంచాయతీ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. కడప జిల్లా రాయచోటి, కమలాపురంలో పోటాపోటీగా నామపత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, రాజాం నియోజకవర్గాల్లోనూ జోరుగా నామపత్రాలు దాఖలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details