ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ - తెలంగాణ వార్తలు

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. మార్చి నెలాఖరు వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపులు, విడుదలపై నిర్ణయం తీసుకోనుంది.

krishna river management board
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

By

Published : Feb 5, 2021, 4:18 AM IST

మార్చి నెలాఖరు వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ నిర్ణయం తీసుకోనుంది. ఇందుకోసం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. హైదరాబాద్ జలసౌధలో జరగనున్న సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి,తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ పాల్గొననున్నారు.

మార్చి నెలాఖరు వరకు తాగు, సాగునీటి అవసరాలను రెండు రాష్ట్రాలు ఇప్పటికే బోర్డుకు అందించాయి. 83 టీఎంసీలు కావాలని తెలంగాణ, 108 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు వినియోగించుకున్న జలాలు, ప్రస్తుతం నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకొని ఇరు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదలపై సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

ఇవీచూడండి:కబ్జాలు ఆపై అక్రమ నిర్మాణాలు.. చోద్యం చూస్తున్న అధికారులు

For All Latest Updates

TAGGED:

krmb meeting

ABOUT THE AUTHOR

...view details