తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి సూచించారు. కేంద్ర మాజీ మంత్రి, తెదేపా తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ దంపతులు.. చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిగా ఆమెను ఇటీవలే ప్రకటించగా.. మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలో గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. త్వరలోనే తిరుపతిలో ఆమె ప్రచారం ప్రారంభించనున్నారు.
చంద్రబాబుని కలిసిన తిరుపతి ఎంపీ అభ్యర్థి - చంద్రబాబుకు ఆయన నివాసంలో కృతజ్ఞతలు తెలిపిన పనబాక లక్ష్మీ
మాజీ కేంద్ర మంత్రి, తెదేపా తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మీ.. పార్టీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఉపఎన్నికలో తనను అభ్యర్థిగా ప్రకటించగా.. మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
![చంద్రబాబుని కలిసిన తిరుపతి ఎంపీ అభ్యర్థి panabaka lakshmi met cbn](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9661171-601-9661171-1606302393488.jpg)
చంద్రబాబుకు కృతజ్ఞతలు తెల్పిన పనబాక లక్ష్మీ