ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలోని మూడు చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా గుర్తింపు.. - tourism in andhra pradesh

రాష్ట్రంలోని మూడు చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా గుర్తింపు లభించింది. గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ఆదర్శ స్మారకాలుగా కేంద్రం గుర్తించింది.

ideal monuments in ap
ideal monuments in ap

By

Published : Jul 20, 2021, 6:32 PM IST

రాష్ట్రంలోని మూడు చారిత్రక కట్టడాలకు ఆదర్శ స్మారకాలుగా కేంద్రం గుర్తింపునిచ్చింది. ఆదర్శ స్మారకంగా గుంటూరు జిల్లాలోని నాగార్జునకొండ, శ్రీకాకుళం జిల్లాలోని శాలిహుండం, అనంతపురం జిల్లా లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి స్థానం దక్కింది.

ఆదర్శ స్మారకాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదర్శ స్మారకాల్లో వై-ఫై, కెఫే, ప్రదర్శన కేంద్రం, లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వారసత్వ కట్టడాల దత్తత పథకంలో కడప జిల్లా గండికోటకు స్థానం లభించిందని ప్రకటించారు. రాష్ట్రంలోని 135 కేంద్ర రక్షిత కట్టడాల్లో మౌలిక వసతులు పెంచుతామని కిషన్‌రెడ్డి అన్నారు.

ఇదీ చదవండి:

ap corona cases: కొత్తగా 2,498 కరోనా కేసులు, 24 మరణాలు

ABOUT THE AUTHOR

...view details