కరోనా వైరస్ విజృంభిస్తున్నందున తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయా? లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ద్వితీయ ఇంటర్లో 4.80 లక్షల మందికి ఉత్తీర్ణులైంది 2.88 లక్షల మందే. ఇంకా దాదాపు రెండు లక్షల మంది తప్పారు. వారు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంది.
ఇక మొదటి ఏడాదిలో తప్పిన వారితోపాటు మార్కులు పెంచుకునేందుకు దాదాపు సగం మందికిపైగా పరీక్షలు రాస్తారు. సాధారణంగా ఫలితాలు ఇచ్చిన తర్వాత నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి. ఆ ప్రకారం ఈసారి జులై నెలాఖరులో జరగాలి. ఇంటర్బోర్డు మాత్రం కాలపట్టికను ప్రకటించలేదు.