ఆంధ్రప్రదేశ్

andhra pradesh

2019 ఖరీఫ్‌ పంటల బీమా ప్రీమియం రూ.590 కోట్లు

By

Published : Dec 2, 2020, 9:13 AM IST

ఖరీఫ్‌ 2019 కాలానికి పంటల బీమా ప్రీమియం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.590 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు.

punam malakondayya
వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య

ఖరీఫ్‌ 2019 కాలానికి పంటల బీమా ప్రీమియం కింద ప్రభుత్వం రూ.590 కోట్లు విడుదల చేసింది. రైతులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు కోసం ఈ నిధులు విడుదల చేస్తూ వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులిచ్చారు. 2019 ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు రూ.1,227 కోట్లు పరిహారంగా తేల్చారు. ఆ సంవత్సరానికి ప్రీమియంగా మొత్తం రూ.1,030 కోట్లను సంబంధిత బీమా సంస్థలకు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details