న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణంతో చేపట్టే రహదారుల పనులకు రెండో విడతగా రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు, ప్రకాశం జిల్లాకు పిలిచిన టెండర్లలో.. ఈసారి కూడా కడపలో రెండే బిడ్లు దాఖలయ్యాయి. అనంతపురం, ప్రకాశంలో నాలుగు, చిత్తూరు, కర్నూలులో మూడేసి సంస్థల చొప్పున టెండర్లు వేశాయి. ఈ అయిదు జిల్లాల పనులకు టెండర్ల దాఖలు గడువు బుధవారంతో ముగియగా, ఆర్అండ్బీ ఇంజినీర్లు గురువారం వీటి సాంకేతిక బిడ్లు తెరిచారు.
ఏ జిల్లాలో ఎలా..
*కర్నూలులో గతంలో బిడ్ వేసిన పులివెందులలోని ఓ నేత కుటుంబానికి చెందిన ఎన్ఎస్పీఆర్తో పాటు, ఈసారి బీవీఎస్ఆర్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టెండర్లు దాఖలు చేశాయి.
*చిత్తూరులో గతంలో టెండర్ కోట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థ ఈసారి కూడా బరిలో నిలవగా, ఇంకా కేఎన్ఆర్, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ బిడ్లు వేశాయి.